ప్రకాశం: కార్మికుల, కష్టజీవుల దోపిడీకి వ్యతిరేకంగా శ్రామికులంతా ఐకమత్యంతో పోరాడాలని సీపీఎం నాయకులు ఊసా వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రశేఖరపురం సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రెడ్ బుక్స్ డే కారుక్రమంలో భాగంగా చదువుదాం సమాజాన్ని మార్చుదాం అనే అంశం గురించి చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులు, కష్ట జీవులను దోచుకోవడం నేటికీ కొనసాగుతుందన్నారు.