AKP: కోటవురట్ల మండలం పాములవాకలో 40,000 లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. నేడో, రేపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తక్షణం దీనిని తొలగించి కొత్త ట్యాంకు నిర్మించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గ్రామంలో కొత్త వీధికి పైప్ లైన్ల నిర్మాణం సరిగా జరగకపోవడంతో తాగునీరు అందడం లేదు.