కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య అధికారులు, వైద్యులు, టెక్నీషియన్లు ఇతర సిబ్బందితో ఎమ్మెల్యే రాము బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సల వివరాలు, అందుబాటులో ఉన్న వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వోపీ, ఐపీ, సర్జికల్ రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.