అనంతపురం జేఎన్టీయూలో అధికారులకు, సిబ్బందికి జనగణనపై శిక్షణ తరగతులు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మలోలా మాట్లాడుతూ.. దశాబ్దం తర్వాత చేపడుతున్న ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో, మొబైల్ యాప్ ద్వారా జరుగుతుందని వివరించారు.