కృష్ణా: బాపులపాడులో ప్రధాన డ్రైనేజీలు పూడికతో నిండిపోవడంతో మురుగు ప్రవహించకుండా దుర్గంధం వ్యాపిస్తోంది. విజయవాడ, నూజివీడు రోడ్లలో డ్రైన్లు చెత్తతో నిండిపోయి కనిపిస్తున్నాయి. విజయవాడ రోడ్డులో గత వర్షాకాలంలో ఒకవైపు మాత్రమే పూడిక తొలగించగా, మరోవైపు నీరు నిలిచిపోయింది. దీంతో సైడ్ డ్రైన్లు కూడా ఎగదన్నుతూ మురుగు నిల్వై దోమలకు కేంద్రంగా మారాయి.