KKD: ప్రాణ రక్షణ కోసం అందరూ భద్రతా నియమాలు పాటించాలని కాకినాడ ట్రాఫిక్-1సీఐ ఎన్. లక్ష్మీ రమేష్ పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నందు ఉన్న పీఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ వాడకం, ఈవ్ టీజింగ్ తదితర అంశాలుపై విద్యార్థినులకు పలు సూచనలు చేశారు.