AKP: జిల్లాలో షెడ్యూల్ ప్రకారం రీసర్వే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండవ విడత 30 గ్రామాల్లో రీసర్వే జరుగుతున్నట్లు తెలిపారు. 80 సర్వే బృందాలు రీసర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.