KRNL: ఆదోనిలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని ఇవాళ ఘనంగా నిర్వహించారు. తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్ వద్ద DHPS ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు వీరేష్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.