శ్రీకాకుళంలో ప్రజా దర్బార్ ను శుక్రవారం ఎమ్మెల్యే కూన రవికుమార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన పలు వినతులను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే, సమస్యలు తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి, స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్, పింఛన్లు,గృహ నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు.