వరంగల్ బహుజనుల హక్కుల సాధన కోసం నిర్వహించబడుతున్న బహుజన ఓరుగల్లు ‘పోరు గర్జన’ సభను విజయవంతం చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ అన్నారు. శుక్రవారం బీఎస్పీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బహుజనుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక సభగా ఈ కార్యక్రమం నిలవాలని ఆకాంక్షించారు. సభకు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.