ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఇవాళ పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.