TPT: ఏర్పేడు మండలం మర్రిమందలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానంలో వెలసిన శ్రీ వాంఛ కల్పలత గణపతి స్వామి వారికి బుధవారం ప్రత్యేక అభిషేకం, అలంకరణ పూజలు చేశారు. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు సాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.