PLD: మాచర్ల మండలం కంభంపాడు గ్రామ సమీపంలో శనివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాచర్ల నుంచి పాల్వాయి జంక్షన్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని యువకుడిని అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన గేదెలు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా, మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.