NLR: బుచ్చిరెడ్డిపాలెంలోని ముంబై జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్లో రోడ్డు దాటుతున్న వ్యక్తిని అకస్మాత్తుగా బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అవ్వగా ఇరువురిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.