NDL: జిల్లాను చెత్త రహితంగా మార్చేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని శనివారం కలెక్టర్ రాజకుమారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో స్వచ్ఛ సర్వేక్షణపై మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేటి నుంచి మే 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణపై కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు పర్యటించనున్నాయన్నారు.