కడప-కర్నూలు జాతీయ రహదారిలోని చెన్నముక్కపల్లె వద్ద కారు ఢీకొని మృతి చెందిన దుప్పిని డీఎఫ్వో ఆదేశాల మేరకు ఎల్బీవో శాంతి మంగళవారం ఖననం చేశారు. పశువైద్య అధికారి ఎం.లక్షుమయ్య మరణించిన దుప్పికి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఖననం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్వాచర్ నవీన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.