PLD: నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు రైతులకు ప్రాజెక్టు కమిటీ తీపి కబురు అందించింది. ఈ నెల 31తో నీటి విడుదల నిలిపివేయాలన్న ముందస్తు నిర్ణయాన్ని మార్చుకుని, ఏప్రిల్ 10 వరకు సరఫరా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కాలువకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కేవలం సాగు అవసరాలున్న ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో హర్షాలు వ్యక్తమవుతున్నాయి.