KRNL: గోనెగండ్ల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని కర్నూలు కలెక్టర్ డా. సిరి తనిఖీ చేశారు. వంటశాల పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. స్టోర్లో బియ్యం, కూరగాయలు పరిశీలించగా ఎండిన పచ్చిమిర్చిపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఇవాళ హెచ్చరించారు.