KDP: మైదుకూరు పట్టణంలోని 16వ వార్డులో గల రామాలయంలో జరుగుతున్న మహోత్సవాల్లో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. మూడు రోజులపాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో గణపతి, సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.