కృష్ణా: గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ నివాసంలో జరిగిన చోరీ కేసును టూ టౌన్ పోలీసులు సోమవారం ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 5 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులు చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని అన్నారు.