ELR: కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని IFTU ఉమ్మడి ప.గో.జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. పెదవేగి మండలం కూచింపూడిలో ఆదివారం జరిగిన ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ బోర్డులోని పథకాలను మరింత పెంచి, అర్హులైన కార్మికులందరికీ వర్తింపజేయాలన్నారు.