KDP: ప్రొద్దుటూరు మండలం అమృతనగర్లో చెత్త సమస్య వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం తెలిపారు. బుధవారం అమృతనగర్ 34వ వీధిలో స్థానిక మహిళతో కలిసి ఆమె మాట్లాడారు. కొత్తపల్లి గ్రామపంచాయతీలోని చెత్తనంతా తీసుకువచ్చి ఇక్కడ వేస్తున్నారన్నారు. దీనివల్ల దుర్వాసన, వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.