KRNL: పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో వార్డు మెంబర్ గోవిందమ్మ భర్త, వైసీపీ నాయకులు వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, స్థానిక నాయకుడు జాము మూకయ్య తదితరులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.