ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరై ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుంచి తీసుకున్నారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.