సత్యసాయి: జిల్లాలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో పూర్తయ్యిందని డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 1,09,708 పత్రాల మూల్యాంకనం, మార్కుల నమోదు ప్రక్రియ పగడ్బందీగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మూల్యాంకనం పూర్తయిన అనంతరం, త్వరలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.