ASR: హుకుంపేట మండలం పట్టంపంచాయతీ నుంచి అమనగిరి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర కూటమి నాయకులతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు 5కిలోమీటర్ల పొడవుతో రూ.5 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. రోడ్డు లేక ఇన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఆరు గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.