BPT: రేపల్లె పట్టణ ఆదర్శ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం 35 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ కె. సాంబశివరావు చేతుల మీదుగా ఈ సామగ్రిని అందజేశారు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఈ సందర్భంగా కమిషనర్ ఆకాంక్షించారు.