KRNL: వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఇవాళ రామాయణ పఠనం ప్రారంభమైంది. రామాయణం మానవులకు మార్గదర్శక గ్రంథమని డాక్టర్ మల్లు వేంకట రెడ్డి తెలిపారు. ప్రవచనంలో డాక్టర్ తొగట సురేశ్ బాబు రామాయణ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.