KRNL: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, ఆయన సతీమణి బుసినే రామాంజినమ్మతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠం మల్లికార్జున చౌదరి కుటుంబ సభ్యులు, నూతన వధూవరులు హాజరయ్యారు. అనంతరం వారికి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.