PLD: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా బుధవారం ఆదేశించారు. ఈ నిర్మాణ పనుల పురోగతిపై ఆమె అధికారులతో సమీక్షించారు. నాణ్యత పాటిస్తూ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. త్వరలోనే పిడుగురాళ్ల బోధనాసుపత్రి ఓపీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.