ప్రకాశం: పొదిలిలోని పలు ప్రాంతాల్లో SI రాజేశ్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ముఖ్య డ్రైవ్ చేపట్టి వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ వినియోగంపై ఆరా తీశారు. ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.