GNTR: తెనాలిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు ఆదివారం ఉదయం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మునగాల మోహన శ్యాం ప్రసాద్ చేతుల మీదుగా వైశ్యపతాక ఆవిష్కరణతో ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారికి 11 రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. ఈ ఉత్సవాలలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.