సత్యసాయి: హిందూపురంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హిందూపురం ఎంపీ పార్థసారథి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపు 90 కంపెనీల ప్రతినిధులు హాజరైనట్టు తెలిపారు.