SKLM: గూడెం గ్రామంలో అయ్యప్ప స్వామి జన్మ దిన మహోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పున్నమేశ్వరస్వామి దేవాలయంలో 50 మంది దంపతులచే అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనము, కలశ పూజ, నవ కలశ స్నాపనాభిషేకం, కుంకుమార్చన, అభిషేకములు, అర్చనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.