KRNL: తుగ్గలి మండలం పరిధిలోనే చెన్నంపల్లి రెవెన్యూలో ఉన్న రైల్వే ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకం చేసి, రైల్వే డబుల్ లైన్ నిర్మాణానికి తరలిస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై చెన్నంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సంబంధిత అధికారులకు బుధవారం ఫిర్యాదు చేసినట్లు గ్రామానికి చెందిన సంజీవ చౌదరి, మరి కొంతమంది తెలిపారు.