కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. పాల్గుణ మాసం శుద్ధ చవితి కావడంతో స్వామి వారు ప్రత్యేక పుష్పాలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాద ఏర్పాట్లు చేశారు.