తిరుపతి గిరిదర్ దాస్ లైన్లో జరిగిన మహిళ మృతి కేసులో భర్తనే నిందితుడిగా ఈస్ట్ పోలీసులు తేల్చారు. ప్రకాశం (D) కంభం (M)నికి చెందిన మోహన రంగా (32) భార్య చైతన్యను గొంతు నులిమి హత్య చేసినట్లు తేలిందన్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణం అని పోలీసులు పేర్కొన్నారు. మార్చి 13న జరిగిన ఘటన తర్వాత పరారైన నిందితుడు, మార్చి 23న పోలీసులకు లొంగిపోవడంతో కేసు మిస్టరీ వీడిందన్నారు.