NDL: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో 13 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా రూ. 5,61,81,535 నగదు ఆదాయం లభించింది. దీంతో పాటు 124 గ్రాముల బంగారం, 5.550 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా అందాయి. పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య ఈ లెక్కింపు ప్రక్రియను దేవస్థానం అధికారులు నిర్వహించారు.