KDP: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే ఆర్.మాధవి రెడ్డి, ఆర్.శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు ఎన్టీఆర్ కూడలిలో జెండా ఆవిష్కరణ, 10:00 గంటలకు కళాక్షేత్రం వద్ద చాయ్ రాస్తా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు బాణాసంచా పేల్చరాదని అధికారులు సూచించారు. పార్టీ శ్రేణులు భారీగా హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యవర్గం పిలుపునిచ్చింది.