AKP: కోటవురట్ల మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో చంద్రశేఖర్ గురువారం మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలో ఉన్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. అలాగే నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, పీఆర్ ఏఈ వర్మ పాల్గొన్నారు.