AKP: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను అధికారులు ముందుగా గుర్తించాలని తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ చంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహీన్ సిన్హాతో కలిసి సమీక్షించారు. శాఖల వారీగా చేసిన ముందస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు.