WGL: రాయపర్తి మండలం కోలనపల్లిలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి ధాన్య గింజను మద్దతు ధరతో పాటు రూపాయలు 500 బోనస్తో కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.