AP: శ్రీ సత్యసాయి జిల్లా చౌళూరులో కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని స్థానికులు సమీప ఆస్పత్రులకు తరలించగా.. ఏడుగురు కోలుకున్నారు. మిగతా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా డైజోఫాం వంటి రసాయనాలతో కల్తీ కల్లు తయారుచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తుండగా.. 5 రోజులుగా తాగుతుండటంతోనే బాధితులు ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.