W.G: తుఫాన్ ప్రభావంతో కూడిన భారీ వర్షాలకు వరికి తీవ్ర నష్టం వాటిలిందని వైసీపీ ఉండి నియోజకవర్గ ఇంఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఐ.భీమవరం పంట నష్టాలను గురువారం అయిన పరిశీలించారు. వరిచేలు నిండా మునిగాయని నీరు బయటకు వెళ్లిపోయిన వరి మొక్క బతికే పరిస్థితి లేదన్నారు. రైతులను ఆదుకోవాలని అన్నారు.