339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న భారత్ జట్టు, ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇస్తోంది. 21 ఓవర్లు ముగిసేసరికి భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 124 పరుగులు చేసింది. భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 25 పరుగులతో ఉంది. అయితే, విజయానికి భారత్కు ఇంకా 216 పరుగులు కావాలి.