ఆస్ట్రేలియాతో WC సెమీఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 32 ఓవర్లు ముగిసేసరికి భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(68*), జెమీమా రోడ్రిగ్స్ (82*) హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. భారత్ విజయానికి ఇంకా 138 పరుగులు చేయాలి. దీంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.