HYD: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సూక్ష్మ పరిశీలకులు సాధారణ పరిశీలకుల నియంత్రణలో పనిచేస్తారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విధుల్లో పాల్గొనే 120 మంది సూక్ష్మ పరిశీలకు ఎన్నికల విధులు, బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబంధనల మేరకు ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.