భారత నావికాదళం 2026 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షను నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 18వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నౌకాదళాన్ని సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన INS విక్రాంత్తో పాటు అత్యాధునిక కల్వరి క్లాస్ జలాంతర్గాములు కూడా పాల్గొంటాయి. ఈ సమీక్ష ద్వారా భారత నావికాదళం శక్తిని ప్రపంచ దేశాలకు చూపించనున్నారు.