TG: పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్గా MLA ప్రేమ్సాగర్ రావును నియమించారు. ప్రభుత్వ సలహాదారుగా బోధన్ MLA సుదర్శన్ రెడ్డిని నియమించారు. 6 గ్యారంటీల అమలు బాధ్యత కూడా అప్పగించారు. మంత్రి పదవి ఆశించిన ఈ ఇద్దరికి కేబినెట్ హోదా పదవులు ఇచ్చారు. కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డి ఉండనున్నారు. మంత్రులకు ఉండే సదుపాయాలన్నీ కల్పిస్తూ జీవో జారీ చేశారు.