అల్లూరి: మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు పంట చేలలో నీరు ప్రవహించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ, దిగుసోనబా గ్రామంలో కొండ వాగు నుండి వచ్చిన వరద నీరు వరి పొలాలపై నుంచి ప్రవహించిది. దీంతో వరి చేను నేలమట్టమైంది. కావున తుఫాను వలన పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ డెలిగేట్ సభ్యులు చంద్రకళ కోరారు.